తెలంగాణ పతక జోరు

ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతున్నది. బ్యాడ్మింటన్‌ అండర్‌-21 బాలుర డబుల్స్‌ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్‌ గౌడ్‌, నవనీత్‌ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు. అండర్‌-21 టెన్నిస్‌ బాలుర డబుల్స్‌లో తీర్థ శాశంక్‌, సాయి కార్తీక్‌ జోడీ రజతాన్ని కైవసం చేసుకున్నది. టెన్నిస్‌ సింగిల్స్‌లో సామ సాత్విక, సిరిమల్ల సంజన కాంస్య పతకాలు దక్కించుకున్నారు.